విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

54பார்த்தது
కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ముళ్ల కంచెకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి యువరైతు మృతి చెందిన ఘటన వైరాలోని కొత్తూరు తండాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. కొత్తూరు తండాకు చెందిన ధారావత్ హాథిరామ్ (36) పనులు నిమిత్తం పొలం వెళ్లగా అక్కడ ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య నాగమణి పాప దీక్షిత, బాబు భవ్యన్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி