నిజామాబాద్ రూరల్ - Nizamabad Rural

வீடியோஸ்


నిజామాబాద్ జిల్లా
సోనియాగాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు: మాజీ మంత్రి
Sep 16, 2024, 13:09 IST/బాల్కొండ
బాల్కొండ

సోనియాగాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు: మాజీ మంత్రి

Sep 16, 2024, 13:09 IST
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, రాజీవ్ గాంధీకి ఏం సంబంధం లేదని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహం సచివాలయం ఎదుట ఎలా పెడతారని ప్రశ్నించారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.