డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

68பார்த்தது
డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ డిచ్పల్లి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మాణం కొరకు భూమిని చూపెట్టడం జరిగిందని కానీ ఆ భూమి ఎక్కడుందో ఆచూకీ లేదన్నారు.

தொடர்புடைய செய்தி