ఢిల్లీకి చెందిన ఉప్పల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రిలియంట్ ఇటోయిలీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ లీగల్ నోటీసులు పంపించారు. ఢిల్లీలో తాను కొనుగోలు చేసిన ఇంటిని సమయం దాటినా తనకివ్వలేదని, అందుకు నష్టపరిహారం చెల్లించాలని ఓ సంస్థకు తేల్చిచెప్పారు. ఇక ఒప్పందం కాలం చెల్లినా తన ఫొటోలను యాడ్స్ లో వాడుతున్నారంటూ మరో సంస్థకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.