సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ వెల్లడించింది. మొత్తం మహిళా ఓటర్లలో 63% మంది ఓటు వేయగా.. పురుషుల్లో అది కేవలం 61.48%గా ఉందని తెలిపింది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఈనెల 20న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.