ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి ఉత్తరప్రదేశ్లోని బంగాసన్, డియోరియా, రుద్రాపూర్, వారణాసి తదితర ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు.