టీ20 ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని భారత కెప్టెన్ రోహిత్శర్మ అన్నాడు. ‘‘గతంలో ఇక్కడ ఆడలేదు. కాబట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం మాకు అత్యంత ముఖ్యం. జూన్ 5న తొలి మ్యాచ్కు ముందు లయను దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. స్టేడియం చాలా అందంగా ఉంది. న్యూయార్క్లో తొలిసారిగా జరుగుతున్న ప్రపంచకప్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు’’ అని రోహిత్ తెలిపాడు.