ఉత్తరప్రదేశ్లోని షామ్లీలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ వాచ్మెన్ బాలికలతో ఫేషియల్ మసాజ్ చేయించుకుంటున్నాడు. మరోవైపు స్కూల్ పిల్లలు పాఠశాలను శుభ్రం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం స్కూల్ వాచ్మెన్ ను సస్పెండ్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారడంతో విద్యాశాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.