వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ పర్వతగిరి మండలంలో పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా తమ (1) మొదటి ప్రాధాన్యత ఓటును వేసి శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గురువారం కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.