వరంగల్ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా, ప్రభుత్వ నిషేధిత గడ్డిమందును విక్రయిస్తున్న మరో నిందితుడితో కలిపి టాస్క్ఫోర్స్, గీసుగొండ పోలీసులు సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. పది లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు సెల్ఫోన్లు, లక్ష పది వేల రూపాయల విలువగల గడ్డి మందులను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.