రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాలను శనివారం బీజేపీ వరంగల్ జిల్లా శాఖ సందర్శించారు. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేననంటూ రేషన్ లబ్ధిదారులకు వివరించారు. రేవంత్రెడ్డి, ఉత్తమకుమార్రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చూసి, తీవ్రస్థాయిలో మండిపడ్డారు.