వాహనాలు నడిపే బాలల తల్లిదండ్రులకు హెచ్చరిక

68பார்த்தது
వాహనాలు నడిపే బాలల తల్లిదండ్రులకు హెచ్చరిక
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మంది వాహనాలు డ్రైవ్ చేసే బాలలను గుర్తించారు. వారిపై జువెనైల్ కోర్టులో చార్జిషీట్స్ ఫైల్ చేయగా అట్టి 13 మంది మైనర్ బాలురను జువెనైల్ మేజిస్ట్రేట్ ఒక రోజు బాలల అబ్జర్వేషన్ హోమ్ కి శుక్రవారం సాయంత్రం పంపారని వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఇకపై వాహనాలు నడిపే మైనరర్లను పట్టుకొని కోర్టులో హాజరు పర్చి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

தொடர்புடைய செய்தி