ఐకెపి సెంటర్ ను సందర్శించిన మార్కెట్ డైరెక్టర్

851பார்த்தது
ఐకెపి సెంటర్ ను సందర్శించిన మార్కెట్ డైరెక్టర్
జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశానుసారం స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు సూచనమేరకు మంగళవారం నాడు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే వరి ధాన్యాన్ని కాంటాలు వేసి, మిల్లులకు పంపించాలని రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా కేంద్రంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపికొనుగోలు కమిటీ మహిళలు, రైతులు, పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி