షెడ్యూల్ కులాలను ఏ. బీ. సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినందుకు సీఎంకి మాదిగ మాదిగ ఉపకులాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ స్టేషన్ ఘనపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నిన్న ఫలితం లభించిందని, మాదిగ మాదిగ ఉపకులాల కల సాకారమైందన్నారు.