మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ దావత్ ఏ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం వర్ధన్నపేట ఉప్పరపల్లిలో ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్క్యాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ సత్య శారద దేవితో కలిసి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుతో సోదరభావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందంటారు.