పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి

1261பார்த்தது
పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని , హిమ్మత్ నగర్, తిమ్మాపూర్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య ఆదేశానుసారం గ్రామశాఖ అధ్యక్షులు , నిరటి యకయ్య, ఎర్ర నరేష్, ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కొడారి కనకయ్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్) పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలనీ కోరారు. అదే విధంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ వైభవం కోసం ప్రతీ కార్యకర్త పాటుపడాలని సూచించారు. అలాగే *ఐదవ సారి గౌరవ శాసనసభ్యులు తాటికొండ రాజన్నని , అత్యధిక మెజార్టీతో గెలిపించుటకు ప్రతీ కార్యకర్త కార్యముకుడు కాగలరని సూచించినారు. రాజన్న ఆదేశానుసారం బూత్ ఇంచార్జ్ లను నియమించారు. ఈ కార్యక్రమాల్లో ఇంచర్జిలు, ఎంపీటీసీ యార నీలమ్మ సోమిరెడ్డి, సర్పంచ్లు తాటికాయల అశోక్ పొన్నాల జ్యోతి నాగరాజు, మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, సీనియర్ నాయకులు తటికాయల బాబు, పెండ్లి స్వామి, గోలి కవిత రెడ్డి, ఉపసర్పంచ్ అశోక్ యూత్ నాయకులు, వార్డ్ మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி