ధర్మారంలో అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య

68பார்த்தது
ధర్మారంలో అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మారంలో జరిగిందని ఆదివారం రాత్రి గీసుగొండ సీఐ బాబులాల్ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన మునగాని కల్యాణి తన భర్త నాగరాజుతో కలిసి కొంతకాలంగా ధర్మారంలో ఉంటోంది. నాగరాజు కొన్నాళ్ల నుంచి తాగుడుకు బానిసై పనులకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

தொடர்புடைய செய்தி