జనగామ: కాలువలో పడి గేదేలు మృతి

71பார்த்தது
జనగామ జిల్లా అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుండి నల్లగొండ జిల్లాకు సాగు నీరు అందించే దేవాధుల ప్రధాన కాలువలో శనివారం నాలుగు పాడి గేదెలు పడి మృతి చెందాయి. రఘునాథపల్లి మండలం జాఫర్ గూడెం గ్రామానికి చెందిన కావటి మహేందర్ పశువులకు నీరు తాగించడానికి కాలువ వద్దకు తీసుకెళ్లగా ప్రమాదవశాత్తు కాలువలో 6 గేదెలు పడ్డాయి. రైతులు వాటిని రక్షించే ప్రయత్నం చేసిన నాలుగు గేదెలు మృతి చెందగా 2 గేదెలను రైతులు రక్షించారు.

தொடர்புடைய செய்தி