పత్తి వర్షాధార పంట కావున జూన్ మొదటి, రెండవ వారంలో సాగు చేస్తారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు విత్తనం వేసే ముందు వరకు భూమినిలోని తేమశాతం తక్కువ ఉండేలా నేలను పదేపదే దుక్కి సిద్ధం చేసుకోవాలి. ట్రాక్టర్తో కానీ, ఎడ్ల అచ్చు నాగలితో అచ్చు గీతాలు దున్నుకోవాలి. అచ్చు గీతాల మధ్య దూరం 45-60 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య దూరం 30 నుండి 40 సెం. మీ ఉండేలా విత్తనాలను విత్తుకోవాలి.