పారా ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

71பார்த்தது
పారా ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భార‌త ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడల్లో నాలుగో రోజు కూడా మనోళ్ల జోరు కొనసాగింది. పురుషుల హైజంప్ టీ46 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ ర‌జ‌త ప‌త‌కం సాధించ‌గా.. మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ కాంస్యంతో మెరిసింది. కాగా ప్రీతీ 100 మీ. టీ35 పరుగు పందెంలో కూడా బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. ఇక ఇప్పటివరకు భార‌త్ గెలిచిన ప‌త‌కాల సంఖ్య 7కు చేరింది.

தொடர்புடைய செய்தி