రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. జైపూర్లో మంగళవారం హీట్ స్ట్రోక్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాటికి మొత్తం హీట్ స్ట్రోక్ కేసుల సంఖ్య 3,965కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మరణించిన వారు ఆగ్రా, ఢిల్లీకి చెందిన వారని అధికారులు తెలిపారు.