భారత్లో మార్చి నుంచి జూన్ వరకు ఎండలు అధికంగా ఉంటాయి. అదే ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జూలై వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతాయి. ఈసారి కూడా జూలైలో అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. కానీ అవి గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 90 ఏళ్ల తర్వాత జూలై నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. సాధారణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ.