కళ్లు పీకేసి, యాసిడ్‌తో కాల్చి బీహార్ లో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు

82பார்த்தது
కళ్లు పీకేసి, యాసిడ్‌తో కాల్చి బీహార్ లో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అనంతరం మృతదేహంపై యాసిడ్ పోసి కాల్చారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లాలోని ధరేని గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని గ్రామానికి చెందిన సర్వీస్ సింగ్ (55)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி