ఎంపీని మోసుకెళ్లి కారు ఎక్కించిన సిబ్బంది.. నెటిజన్లు ఫైర్

599பார்த்தது
ఢిల్లీలో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అక్కడి తన అధికారిక నివాసం వద్ద మోకాళ్ల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో సిబ్బంది ఆయన్ను మోసుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. సామాన్యులు ఇదే నీటిలో నడుస్తూ కష్టాలు పడాలి, కానీ పాలకులు నీటిలో కాలు కూడా మోపరా? అని ఆయనపై నెటిజన్లు విమర్శలు చేశారు.

தொடர்புடைய செய்தி