మధ్యప్రదేశ్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మృత్యువాత పడ్డారు. గ్వాలియర్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ఈ ఎండలకు జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. బుధవారం పని నిమిత్తం తల్లితో పాటు బయటకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురై చనిపోయారు. ఒక ఆటో డ్రైవర్ కూడా రోడ్డుపైనే మృత్యువాత పడ్డాడు.