ముగ్గురిని చంపి తిన్న చిరుత.. మ్యాన్‌ ఈటర్‌గా మారిందంటూ గ్రామస్తుల ఆందోళన

70பார்த்தது
ముగ్గురిని చంపి తిన్న చిరుత.. మ్యాన్‌ ఈటర్‌గా మారిందంటూ గ్రామస్తుల ఆందోళన
అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న ఓ చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చిరుతను బందించాలని కోరుతూ హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల అనే బాలిక, ఖేమారామ్‌ మరియు ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ ఈ చిరుత దాడిలో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி