అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లె. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య చదువుతో పాటు పార్ట్టైం జాబ్ కూడా చేస్తున్నారు.