కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం సొసైటీ సీఈఓ హుస్సేన్, కంప్యూటర్ ఆపరేటర్ పాముల వెంకటేశ్వర్లును అధికారులు సస్పెండ్ చేయాలని పాలకవర్గం జిల్లా తీర్మానం చేశారు. పాలకవర్గం సమావేశమై ఇరువురిపై సస్పెన్షన్ తీర్మానం చేసింది. పాలకవర్గం తీర్మానం మేరకు ఇరువురిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించినట్లు బుధవారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.