పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

58பார்த்தது
పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి
చింతపల్లి మండల పరిధిలోని వింజమూరులో శనివారం పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జంగయ్య(42) తన వ్యవసాయ పొలంలో దొండకాయలు తెంపేందుకు వెళ్లగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంలో పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

தொடர்புடைய செய்தி