కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు. తిరువనంతపుర
ం ముతలాపోజి హార్బర్ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడటంతో అంచుతెంగుకు చెందిన మత్స్యకారుడు అబ్రహం (60) మరణించాడు. తిరువనంతపురంలోని అరువిక్కరకు చెందిన 56 ఏళ్ల అశోక్, కన్హంగాడ్కు చెందిన 14 ఏళ్ల సినాన్, పెరుంబవూరులో 10వ తరగతి విద్యార్థి ఎల్డోన్ నదిలోని మునిగి చనిపోయారు.