ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది

62பார்த்தது
ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ మండేపల్లికి చెందిన యన్. లక్ష్మి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దీంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు రూ. 2లక్షల 50వేలు మంజూరు చేపించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించారు.

தொடர்புடைய செய்தி