ఈనెల 23 వరకు నవోదయ దరఖాస్తుల గడువు పెంపు

70பார்த்தது
ఈనెల 23 వరకు నవోదయ దరఖాస్తుల గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలోని ఆరోతరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పెంచినట్లు, కరీంనగర్ జిల్లా చొప్పదండి నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ మంగతాయారు మంగళవారం తెలిపారు. ఈనెల 16తో అయిపోయిన గడువును మరో వారంపాటు పెంచినట్లు తెలిపారు. వచ్చే ఏడాది సీబీఎస్ఈ విధానంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி