చొప్పదండి: కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వం.. ఎమ్మెల్యే సత్యం

72பார்த்தது
చొప్పదండి: కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వం.. ఎమ్మెల్యే సత్యం
కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమని ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కాట్నపల్లి గుమలాపూర్ కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి ప్రారంభించారు. రైతులకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி