తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల షెడ్యూల్ ఖరారు అయ్యింది. జూన్ 2న గన్పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించనున్నారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికారిక గీతాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు.