అంగన్వాడీ పిల్లలకు మంచి విద్యను అందించాలి: కలెక్టర్

85பார்த்தது
అంగన్వాడి కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పేరుతో మంచి విద్యను పిల్లలకు అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పోషన్ అభియాన్ మాస ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం అందించాలని సూచించారు సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఈవో వెంకటేశ్వర్లు వైద్యాధికారి గాయత్రి దేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி