దేశవ్యాప్తంగా రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 వాహన ప్రమాద బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 నుంచి 2022-23 మధ్యలో పెండింగ్ క్లెయిమ్లు మరింత పెరిగాయి. సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ.జైన్ ఏప్రిల్లో చేసిన దరఖాస్తుకు స్పందిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) ఈ వివరాలను అందించింది.