వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రాజద్రోహ ప్రసంగాలు చేశారనే కేసులో విద్యార్థి నాయకుడు షార్జీల్ ఇమామ్కు కాస్త ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఢిల్లీ అల్లర్ల కేసులో మాత్రం ఆయన జైలులోనే ఉండనున్నారు. ఈ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఆరోపణలతో కూడిన పెద్ద కుట్ర కేసులో అతను జైలులోనే గడపనున్నారు.