ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అదృశ్యం

63பார்த்தது
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అదృశ్యం
తనకంటే ఐదు సవంత్సరాల చిన్న వాడైనా యువకుడిని యువతి ప్రేమించి పెళ్లి చేసుకొని ఏటో వెళ్ళిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ ఠాణా పరిధిలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మద్దూరి శశికుమార్(24) అదే జిల్లా శాంతినగర్ కు చెందిన దుర్మతి సుష్మిత(29) ను 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2 నెలలుగా శివకుమార్ ఎలాంటి పని చేయకుండా ఇంటి వద్ద ఉండడంతో తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. గురువారం మధ్యాహ్నం శివకుమార్ అరగంట బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి భార్య సుష్మిత కనిపించలేదు. ఆమె చరవాణి స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

தொடர்புடைய செய்தி