వెల్డింగ్ పనులు చేయడం వల్లే రాజ్కోట్ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తేల్చారు. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన CC ఫుటేజీని విడుదల చేశారు. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించడంతో 28 మంది సజీవ దహనమయ్యారు. ఇక గేమింగ్ జోన్లో భద్రతా లోపాలను గుర్తించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారని గుజరాత్ HC మండిపడింది. నాలుగేళ్ల నుంచి నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది.