’కోల్కతా నైట్రైడర్స్ గెలుపు బెంగాల్ వ్యాప్తంగా సంబరాలు తీసుకొచ్చిందని, ఆటగాళ్లతో పాటు ఇతర స్టాఫ్, ఫ్రాంచైజీకి నా శుభాకాంక్షలు‘ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మూడోసారి ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లు, స్టాఫ్ అందరికీ సచిన్ టెండుల్కర్ శుభాకాంక్షలను తెలిపారు. కేకే రైడర్స్కు వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలిపారు. గతంలో నెహ్రా, ఇప్పుడు గౌతమ్ గంభీర్ మెంటార్లుగా విజయం సాధించారని అన్నారు.