జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ మధ్య నడుస్తున్న నీలాంచల్ ఎక్స్ప్రెస్కు శనివారం పెను ప్రమాదం తప్పింది. రాంచీ రైల్వే డివిజన్ లెంగ్డిహ్ గ్రామం వద్ద ఓవర్ హెడ్ వైర్ తెగి రైలుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. దీనిని రైల్వే శాఖ ధ్రువీకరించలేదు. ఇద్దరు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ బాగ్ముండిలోని ఆసుపత్రిలో క్షతగాత్రులను చేర్చారు.