పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపిడిఓ

65பார்த்தது
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపిడిఓ
ప్రజలు తమ ఇంటితో పాటు చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మల్లయ్య పల్లి గ్రామ ప్రత్యేక అధికారిని, ఎల్లారెడ్డి ఎంపీడీఓ టి. లక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని మల్లయ్య పల్లి గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ. తమ ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు. మురికి కాలువల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி