భగలాముఖీ అమ్మవారికి వెండి పళ్ళెం బహుకరణ
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీదత్తా పీఠంలో శ్రీ భగలా ముఖీ అమ్మవారికి, ఎస్ఎస్ఆర్ సంస్థల యజమాని అసోల్ల గంగా ప్రసాద్ వెండి పల్లెం బహుకరించినట్లు పీఠాధిపతి కార్తిక్ పటేల్ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ. అమ్మవారికి స్టీల్ పళ్ళెంలో ప్రతిరోజు పండ్ల నైవేద్యం పెట్టి పూజించడం చూసిన వారు, అమ్మవారికి స్టీల్ ప్లేట్లో కాకుండా వెండి పళ్ళెంలో పండ్ల నైవేద్యం పెట్టాలని పెద్ద వెండి పళ్ళెం బహుకరించారని తెలిపారు.