పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు: డీపీఓ

75பார்த்தது
పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు: డీపీఓ
పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ముథోల్ మండలంలోని చించాల, ముథోల్ పంచాయతీని పరిశీలించారు. చించాలలో మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం, ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో అక్కడ పంచాయతీ కార్యదర్శి అమితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం మురుగు కాలువలను శుభ్రం చేయించాలని సూచించారు. అనంతరం ముథోల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி