వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

62பார்த்தது
డ్రైవర్లు, వాహనదారులు రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించాలని దస్తురాబాద్ మండల పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కాగితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది దైవాకర్ షఫీ, రవి, ఉసన్న, రాజలింగన్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி