మర్చిపోలేని ఆ సంఘటనకు రెండేళ్లు

73பார்த்தது
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను ఆందోళనకు గురిచేసిన కడెం ప్రాజెక్టుకు వరద బీభత్స సంఘటన రెండేళ్లు అవుతోంది. 2022 జూలై 13న ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. నాడు లక్షల క్యూసెక్కులలో వరద నీరు రావడంతో కడెం ప్రాజెక్టు తెగిపోతుందని అందరూ భయపడ్డారు. కడెం పట్టణం పూర్తిగా వరదలో చిక్కుకోగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. నాటి ఘటనను ప్రజలు గుర్తు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி