భూ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్ అజీజ్ హైమద్ ఖాన్ అన్నారు. సోమవారం దిలావర్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల ఫిర్యాదుదారులు నిర్భయంగా తమ సమస్యలను అర్జీ పెట్టుకోవచ్చన్నారు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు.