చండూరు మున్సిపాలిటీ పరిధిలో మూడు రోజుల క్రితం నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చిలుకూరి పరమేశ బాబు అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు వారి కుటుంబాన్ని పరామర్శించి, 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించారు.