అనాజిపురం వద్ద దారి దోపిడీ

71பார்த்தது
అనాజిపురం వద్ద దారి దోపిడీ
టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న వృద్ద దంపతులను కారుతో అడ్డగించి వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు చోరీ చేసి దారి దోపిడికి పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని అనాజిపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అడ్డ గూడూరుకు చెందిన అసర్ల మల్లయ్య తన భార్య సోమమ్మతో కలిసి టీవీఎస్ ఎక్సెల్ పై మోత్కూరు మండలం ముసిపట్లలో ఉన్న తమ కూతురు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో అనాజిపురం సమీపంలో ఎదురుగా కారులో వస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న వాహనానికి కారు అడ్డంపెట్టి బెదిరించి సోమమ్మ మెడలో ఉన్న రెండు వరసల బంగారు పుస్తెలతాడును దొంగిలించారు. తాము కేకలు వేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని పోలీస్ స్టేషన్ లో చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. చోరీ చేసిన వ్యక్తులు అనాజిపురం వైపు పారిపోయినట్లు వృద్ధ దంపతులు మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సంఘటనకు కారకులైన వారికోసం గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி