పేర్లు నమోదు చేసుకోకుండా చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కి పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్కు వెళుతుండగా.. గౌచార్ చెక్ పోస్ట్ నుంచే వారిని వెనక్కి పంపించినట్లు చమోలీ ఎస్ఎస్పీ కార్యాలయం మంగళవారం తెలిపింది. పేర్లు నమోదు చేసుకోకుండా యాత్రకు రావొద్దని సూచించింది.